నాటి భారతం  (Author: గోగినేని రత్నాకరరావు)

నందర నొకరీతి । నాదరించి

తే॥గీ॥ సకల సుగుణాభిరామవై । సన్నుతింప

          భాష చాలని ఘనతను । బడసినావు

          యోగ్యముగ నీకడ చరించు । భాగ్యమంది

          పాలుగొంటి మాఘనతను । భరతమాత!  (5)

సీ॥ పసిడి పంటలవెల్గు । బహుళంబు వరకును

 ప్రసరింప గాజేయు । పంటచేలు

          వేదసుగంధముల్‌ । విశ్వవీధులయందు

 వ్యాపింపజేయు వి । ద్యాలయాలు

          ఎట్టి రుగ్మతనైన । నెడలింపగా జాలు

 దక్షతన్‌ కల్గు వై । ద్యాలయాలు

          కార్యార్థులై వచ్చు । కడప్రాంత జనులకు

 సకల సౌకర్య వ । సతిగృహాలు

తే॥గీ॥ నీతినియమాలు వీడని । నిమితగాళ్ళు

          ధర్మమార్గంబు తప్పని । తక్కువారు.

          ఎటను రఘురామ రాజ్యంబె । ఎంచిచూడ

          ప్రకట గుణగణ భరిత! మా । భరతమాత  (6)

----  జైహింద్‌ ----

 

0 Comments